*థియేటర్లలో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలి:* టి ఎఫ్ సి సి చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

నిర్మాతలు లేనిదే సినిమాలు లేవు. సినిమాలు లేనిదే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు లేరు. అదే విధంగా వీరూ లేకుండా వారు కూడా లేరు. అయితే మారుతున్న కాలంతో పాటుగా థియేటర్స్ లో సినిమాలు రన్ అవ్వడం అనేది కూడా ఒకింత క్లిష్టతరంగా మారింది. ఇలా అనేక కారణాలతో రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ మూత పడనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ రెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అంటే 2002 సంవత్సరం వరకు పర్సెంటేజ్ విధానమే అమలులో ఉండేది. కొంతమంది బడా నిర్మాతలు, పర్సెంటేజ్ విధానానికి స్వస్థి పలికి, రెంట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అప్పుడే సింగల్ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు పర్సెంటేజ్ విధానమే లాభదాయకం. చిన్న నిర్మాతలకు మరింత మేలు జరుగుతుంది. సినిమా నిర్మాణాలు పెరిగి కార్మికులకు మేలు జరుగుతుంది. ఈ విధానమే సబబైనది. ఇలాంటి క్లిష్ట సమయంలో తెలుగు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని, పర్సెంటేజ్ విధానాన్ని అమల్లోకి తేవాలని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేస్తోంది అన్నారు టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. మా ఆర్ కె  ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన "దీక్ష" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోల చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి.  ఇప్పుడు థియేటర్స్ మూత పడితే మాలాంటి నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుంది.  రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని పర్సెంటేజ్ విధానాన్ని అమలులోకి తెచ్చి, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్  సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!