జూన్లో ‘దీక్ష’ చిత్రం విడుదలకు సన్నాహాలు
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం"దీక్ష". ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..‘‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్...