Posts

గద్దర్ అవార్డ్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది - టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Image
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి,  సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహణతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు కొన్ని గంటల పాటు సమయం కేటాయించి అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నింపాయి. అవార్డ్ పొందిన ప్రతి ఒక్కరూ ఇంకా బాగా మూవీస్ చేయాలనే స్ఫూర్తి పొందుతారు. ఏటా గద్దర్ అవార్డ్స్ క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నా. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారు కూడా గద్దర్ అవార్డ్స్ విజయవంతం కావడాన...

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Image
తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై  తెరకెక్కిన సినిమా "మెర్సీ కిల్లింగ్" సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో  సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించి ప్రస్తుతం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీమతి వేదుల బాల కామేశ్వరి మాట్లాడుతూ... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. మా సినిమాలో నటించిన బేబి హరికకు గద్దర్ అవార్డ్ రావ...

టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..“మిస్టీరియస్"

Image
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా “మిస్టీరియస్" టైటిల్ పోస్టర్ లాంచ్  మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్),అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations)   బ్యానర్ పై  ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా లెవెల్లో చేస్తున్నఈ సినిమా సౌత్ లో ఉన్న  అన్ని భాషలలో చేస్తున్న సినిమా చాల బాగుంది పోస్టర్ సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నాను . “మిస్టీరియస్" టీం కి  శుభాకాంక్షలు తెలియజేశారు.  దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టర...

హీరోలు అవసరం లేదు, కంటెంట్ ఈజ్ కింగ్ అని "వైల్డ్ బ్రీత్" సినిమా ప్రూవ్ చేస్తుంది - ప్రముఖ నటుడు శివాజీ రాజా

Image
కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా.  రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్ ను ఈ రోజు యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు.  ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ - నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను కెరీర్ ప్రారంభం నుంచీ వారితో స్నేహం చేస్తున్నా. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు న...

సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'కార్తిక-మిస్సింగ్ కేస్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Image
థ్రిల్లింగ్ అనుభూతికి సిద్ధంగా ఉండండి! ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ యుగి నేటి నుంచి Aha OTTలో  స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు వెర్షన్ కి 'కార్తిక-మిస్సింగ్ కేస్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని భవాని మీడియా రిలీజ్ చేస్తుంది.  జాక్ హారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గొప్ప స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను పూర్తిగా అలరించింది. కథిర్, నట్టి, ఆనందీ, నరైన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. కథలో, ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతున్నాడు. దర్యాప్తులో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపు ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి. ఈ వారం విడుదలయ్యే అత్యంత ఆసక్తికరమైన థ్రిల్లర్‌ను మిస్‌ అవకండి —కార్తిక-మిస్సింగ్ కేస్,నేటి నుంచి కేవలం Aha OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మీ వీకెండ్‌ను మిస్...

పాజిటివ్ బజ్‌తో జూన్ 13న ZEE5 ప్రీమియర్‌కు సిద్దంగా ఉన్న ‘DD నెక్స్ట్ లెవల్’

Image
ZEE5లో హర్రర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ జూన్ 13న ప్రీమియర్ కావడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఈ చిత్రంలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఇప్పటికే థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ZEE5లోకి రాబోతోంది. DD నెక్స్ట్ లెవల్ జూన్ 13 నుండి ZEE5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్ కథ అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే చిత్రంలో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో అద్యంతం వినోద భరితంగా సాగుతుంది. కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నదే ఆసక్తికరంగా సాగుతుంది. జూన్ 13 నుండి ZEE5లో ప్రత...

సామాన్య ప్రేక్షకులకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలి, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం - టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Image
తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై థియేటర్స్ టికెట్ రేట్స్, తిను బండారాల ధరలు  వంటి విషయాలపై చర్చించడం అభినందనీయం అన్నారు రామకృష్ణ గౌడ్. ఆయన ఈ రోజు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - నేను కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి టికెట్ రేట్స్, థియేటర్స్ లో తినుబండారాల రేట్స్ తదితర సమస్యల గురించి ప్రస్తావించాను. ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరం. డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించారు. సినిమాను సామాన్య ప్రేక్ష...