Posts

సాయి దుర్గాతేజ్‌, బ్రహ్మాజీల చేతుల మీదుగా‘గుట్టు చప్పుడు’ టీజర్‌ లాంచ్‌

Image
డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌`ఆయేషాఖాన్‌ జంటగా, హను`మేన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో మణీంద్రన్‌ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌టైనర్‌ ‘గుట్టు చప్పుడు’. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్‌ నటులు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు.  అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ... టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ను కుదిరారు. భారీ బడ్జెట్‌తో తీశారు. దర్శకుడు కూడా తీసిన కంటెంట్‌ను మళ్లీ చెక్‌ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. ఈ టీజర్‌ చూసిన తర్వాత సిని

రోటి కపడా రొమాన్స్ అందరికీ నచ్చుతుంది

Image
ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ పుట్టినరోజు వేడుకను ‘రోటి కపడా రొమాన్స్’ చిత్ర బృదం ఘనంగా నిర్వహించారు. బెక్కం వేణు గోపాల్ ప్రారంభించిన లక్కీ మీడియా 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా విశేషం.    నిర్మాత సృజన కుమార్ బోజ్జం మాట్లాడుతూ: ఈ సినిమాతో నిర్మాతగా నా జర్నీ మొదలుపెట్టాను. బెక్కం వేణు గోపాల్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చెయ్యాలను కోరుకుంటున్నాను హీరో హర్ష నర్రా మాట్లాడుతూ: మనం పుట్టినప్పుడు మన జీవితం మొదలవుతుంది కాని పది మందికి ఉపయోగపడినప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది. లక్కీ మీడియా ద్వారా గత 18 సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపయోగపడిన బెక్కం గారికి 18వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈయన జీవితం మాకు చాలా స్పోర్తి దాయకం. మా సినిమా రోటి కాపాడ రొమాన్స్ అందరికీ నచ్చే యూత్ ఫుల్ సినిమా అండి. అందరూ చూడండి.  హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ: బెక్కం సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా సినిమా డేట్ కూడా త్వరలోనే చెప్తాము. హీరో తరుణ్ పొనుగోటి మాట్లాడుతూ: ఒక హీరో ఎంత మందితో వర్క్ చేసినా కూడా తనకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ని మర్చిపోలేము. బెక్కంగారు నాకు

ఉషాప‌రిణ‌యం సెట్‌ను సంద‌ర్శించి టీమ్‌కు ఆల్‌ద‌బెస్ట్ చెప్పిన స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్

Image
ఉషా ప‌రిణ‌యం షూటింగ్ పూర్తి తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం  బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,   తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెమ్‌సాంగ్‌ను హీరో శ్రీ‌క‌మ‌ల్‌, ప్ర‌ముఖ క‌థానాయిక సీర‌త్‌క‌పూర్‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఘ‌ల్లు.. ఘ‌ల్లు అనే ఈ సాంగ్‌కు విజ‌య్ పొల్లంకి కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందించారు. అయితే ఈ సాంగ్ చివ‌

"రామం రాఘవం" టీజర్ విడుదల !!!

Image
స్కేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ కొరణాని దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం "రామం రాఘవం". సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్. తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ..  దర్శకుడు బాలా మాట్లాడుతూ.. రామం రాఘవం టీజర్ బాగుంది. ధనరాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా సముద్రఖనిని మెచ్చుకోవాలి,  ఇలాగే అతను చాలా మందికి సహాయం చేసి.. ప్రోత్సహించాలి, రామం రాఘవం పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. నిర్మాత, పృథ్వి పోలవరపు మాట్లాడుతూ... సముద్రకని అన్న సహాయం లేకుండా నేను ఈ సినిమా చేయలేను. ఈ సినిమా తీయడంలో ఖని  అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి. తండ్రీ కొడుకుల అనుబందాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చింది, జనాలకు నచ్చుతుందని పేర్కొన్నారు.  నటి మోక్ష మాట్లాడుతూ.. తమిళంలో ఇది నా మొదటి సినిమా. తమిళ సిని

హైదరాబాద్‌లో ప్రముఖ అతిథులతో కలిసి ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ 'శిల్పాభా' ప్రారంభం

Image
భారతదేశపు పాత ప్రాచీన సంప్రదాయ జానపద కళా చిత్రాలను కాపాడటం, ప్రచారం చేయటం, మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి, 'శిల్పాభా' పేరుతో ప్రటికృత్ & పాప్బాని ద్వారా ఏర్పాటు చేయబడిన ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ఇవాళ హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. ఈ టూర్ తో భారతదేశపు 6వ శతాబ్దానికి చెందిన కళా సంప్రదాయాలకు మరింత ఆదరణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా తెలంగాణ ప్రముఖ విజువల్ ఆర్టిస్ట్, నటి స్రవంతి జులూరి పాల్గొన్నారు. ఆమెతో పాటు ప్రముఖ కళాకారులు సరస్వతి లింగంపల్లి, అన్నపూర్ణ మడిపడిగ, మరేడు రామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అతిథులు తెలంగాణ కళా సాంప్రదాయాలపై తమ అభిప్రాయాలను పంచుకుని ఆకట్టుకున్నారు. భారతీయులలో సంప్రదాయ కళా రూపాల విలువకు సంబంధించిన అవగాహనను పెంచటమే 'శిల్పాభా' లక్ష్యం. ఈ ప్రారంభ కార్యక్రమంతో అందుకు ముందడుగు పడింది. ఈ పర్యటనతో సందర్శకులు జానపద కళా అభివృద్ధి, ప్రాముఖ్యతపై ఆసక్తికరమైన చర్చలతో పాటు, ఈ రంగంలో ప్రముఖ నిపుణులను సంప్రదించే అవకాశం పొందుతారు. 'శిల్పాభా' తన తదుపరి కార్యక్రమాలను కూడ

విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న బుల్లెట్ చిత్రం

Image
బుల్లెట్ చిన్న చిత్రం కాదు.. మంచి సినిమా శ్రీ బండి సదానంద్ & మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు  కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం *బుల్లెట్*. ఎవ్వడికైనా దిగుద్ది ట్యాగ్ లైన్ తో దర్శకుడు చౌడప్ప రూపొందించారు.   హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు.  మార్చి 8న  విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు.  శోభారాణి గారు మాట్లాడుతూ.."చిన్న చిత్రాలు రెండు మూడు రోజులు కూడా ఆడని ఈ రోజుల్లో *బుల్లెట్* 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవడం మామూలు విషయం కాదు. *బుల్లెట్* ఇప్పుడు చిన్న సినిమా కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు చౌడప్ప గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన డైరెక్టర్ గా మరిన్ని

పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా చాందిని చౌదరి నటిస్తున్న యేవమ్‌ లుక్‌ విడుదల

Image
కథానాయిక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యేవమ్‌'. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం  ఈ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపించినట్లుగా చాందిని చౌదరి పాత్ర 'ఆడపిల్లని అయితే ఏంటంటా? ' అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన ఎంతో హైలైట్‌గా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నార