ధనుష్ "ఇడ్లీ కడై" షూటింగ్ పూర్తి !!!
హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'ఇడ్లీ కడై' ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా యాభై రెండో ఫిలిమ్ అలాగే తను డైరెక్ట్ చేస్తోన్న నాలుగో సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇటీవల బ్యాంకాక్ లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు, ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు, ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని ఇటీవల తెలుగులో రిలీజ్ చేశారు.
రాయన్ సినిమా తరువాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'ఇడ్లీ కడై' అందుచేత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ షాలిని పాండే, కీలక పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకె ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Comments
Post a Comment