సైటిపిక్ థ్రిల్లర్ 'మాతృ' సినిమా మూవీ నుండి "చూస్తున్నవేమో" సాంగ్ కు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసలు!!!


శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో  బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'మాతృ'. శ్రీరామ్, నందినీ రాయ్, సుగ్గి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. బుర్లే హరిప్రసాద్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జోరు అందుకున్నాయి. 'మాతృ' టైటిల్‌కు తగ్గట్టుగానే "చూస్తున్నవేమో" అబీటు సాగే ఎమోషనల్ సాంగ్‌ ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ మధ్యకాలంలో వచ్చిన సైటిఫిక్ థ్రిల్లర్స్ అన్ని మంచి విజయం సాధించాయి, అదే తరహాలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. "చూస్తున్నవేమో"... సాంగ్ చాలా బాగుంది... ఈ వేసవిలో మాతృ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు.

'మాతృ' సినిమా నుండి ... ఏదేదో చెయ్యమంటోంది... మల్లె పూల వాసనె... సాంగ్స్ కూడా మంచి ఆదరణ లభించాయి. అన్ని డిఫరెంట్ జానర్స్ లో వేటికదే ఆకట్టుకుంటోంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా  పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా