మలయాళంలో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా

నిర్మాత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ - భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనేది మా సంస్థ లక్ష్యం. ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలోకి భారీ చిత్రాన్ని తీసుకురాబోతున్నాం. మా సంస్థ నుంచి ప్రేక్షకులు ఆశించే హై క్వాలిటీ మూవీని టాలెంటెడ్ టీమ్ తో కలిసి నిర్మించనున్నాం. అన్నారు.

డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ - ఇలాంటి గొప్ప మూవీ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్యాషనేట్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా విజన్ ను త్వరలోనే ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాం. అన్నారు.

స్క్రిప్ట్ అందించిన జితూ మాధవన్ మాట్లాడుతూ - నా మనసుకు దగ్గరైన కథ ఇది. ఇలాంటి బ్యూటిఫుల్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక మంచి మూవీని అందిస్తామని చెప్పగలను. అన్నారు.

త్వరలోనే ఈ చిత్రానికి సంధించిన కాస్టింగ్, రెగ్యులర్ షూటింగ్ వివరాలు మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.

టెక్నికల్ టీమ్
----------------
ఎడిటర్ - వివేక్ హర్షన్
డీపీవో - షైజు ఖాలిద్
మ్యూజిక్ - సుషిన్ శ్యామ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
రచన - జితూ మాధవన్
నిర్మాతలు - వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం - చిదంబరం

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!