ఆహాలో చాందిని చౌదరి 'యేవమ్‌' రిలీజ్‌.. నేటి నుంచి స్ట్రీమింగ్

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. జూన్‌ 14న థియేటర్లలో విడుదలై ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన నవ్యమైన చిత్రంగా అభినందనలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి అనగా నేటి నుంచిఆహా ఓటీటీలో   స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో మహిళల గొప్పదనం, మహిళా సాధికారిత అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు డీల్‌ చేశాడు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కారు. వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు అనేది ఈ చిత్రంలో చూపించారు. మిస్టరీగా వున్న ఓ కేసును ఓ మహిళా పోలీసు అధికారి ఎలా  పరిష్కరించారు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను అలరిస్తుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓటీటీలో వీక్షించాల్సిందిగా కోరుతున్నారు మేకర్స్‌.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా