మాట ముచ్చటతో... "లగ్గం" మొదటి షెడ్యూల్ పూర్తి !!!

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు 
రచన -దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఫిబ్రవరి 5నుండి పూజతో ప్రారంభమైన ఈ  "లగ్గం"  శరవేగంగా మొదటి షెడ్యూల్ ఈరోజుతో పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 23 నుండి వరపూజతో  రెండవ షెడ్యూల్  ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది.
రాజేంద్రప్రసాద్, రోహిణి, సాయి రోనాక్, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి వంటి సీనియర్  నటులు నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ విలువలను, మర్చిపోతున్న సాంప్రదాయాలను, సంస్కృతిని మళ్లీ గుర్తుచేసే... అరుదైన చిత్రంగా తెరకేక్కబోతుంది.

ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.  బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


నటీనటులు:
సాయి రోనక్, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న , తదితరులు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్