వివరెడ్డి హీరోగా 'ఓ తండ్రి తీర్పు’ డిసెంబర్ 27న థియేటర్స్ లో విడుదల
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది . సహృదయులు దైవాంశ సంభూతులు డాక్టర్ కెవి రమణ చారి గారి ఆశీస్సులతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు కాంచనపల్లి. కుటుంబ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు....