Posts

‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అద్భుతమైన విజయం సాధించబోతోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నవీన్ చంద్ర

Image
‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. *"Viraatapalem" Trailer - Telugu* https://youtu.be/TYU8OwKM-mk నవీన్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. రెక్కీ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస...

మై హోమ్ అవతార రెసిడెంట్స్ సమక్షంలో సందడిగా "తమ్ముడు" మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ 'భూ అంటూ భూతం..' రిలీజ్

Image
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మై హోమ్ అవతార్ రెసిడెంట్స్ సమక్షంలో "తమ్ముడు" సినిమా ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్, నటి లయ, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ - 'భూ అంటూ భూతం..' సాంగ్ రిలీజ్ మీ అందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ తమ్ముడు చిత్రంతో టాలీవుడ్ కు వస్తున్నాను. ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని, కంపోజ్ చేసిన అజనీష్, సాంగ్ రాసిన సింహాచలం మన్నేలా బ్యూటిఫుల్ ఔట్ పుట్ ఇచ్చారు. ఈ పాటలోని హుక్ స్టెప్ కూడా మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి పాట...

ఘనంగా ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్

Image
తెలుగు నట దిగ్గజం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీజీ జనార్థన్, టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో *నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ* - తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చూపించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని నిరూపించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని దేశ దేశాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సక్సెస్ ను పురస్కరించుకుని ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా టీడీ జనార్థన్ గారికి ఇతరులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. మేము విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తెలుగు వారు ఎన్టీఆర్ పట్ల చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత సంతోష...

ZEE5 Unveils ‘Viraatapalem: PC Meena Reporting’ – A Gritty Telugu Supernatural Thriller Premiering June 27

Image
*~ From the makers of the critically acclaimed series Recce comes another edge-of-the-seat thriller! Directed by Krishna Poluru, ‘Viraatapalem: PC Meena Reporting’ is a gripping supernatural mystery loaded with suspense, secrets, and unexpected twists. Starring Abhignya Vuthaluru and Charan Lakkaraju, the series premieres June 27 only on ZEE5. ~* ZEE5, India’s largest home-grown video streaming platform and a hub for bold, multilingual storytelling, is all set to present its newest Telugu original series ‘Viraatapalem: PC Meena Reporting’ a gripping supernatural Thriller set in the heart of Andhra’s rural landscape. Starring Abhignya Vuthaluru and Charan Lakkaraju, and directed by Krishna Poluru, the series premieres on June 27. With haunting folklore, buried village secrets, and a bold investigation at its core, the series promises an edge-of-your-seat viewing experience, also making it binge worthy. https://x.com/ZEE5Telugu/status/1934938717090959471 Set in the 1980s, in ...

24 గంటల్లో 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" టీజర్

Image
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "రాజా సాబ్" సినిమా టీజర్ డిజిటల్ వ్యూస్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ఈ టీజర్ 24 గంటల్లోనే 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. టీజర్ కు వస్తున్న భారీ వ్యూస్ "రాజా సాబ్" సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపించిన తీరు, గ్రాండ్ మేకింగ్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు "రాజా సాబ్" టీజర్ ను రిపీటెడ్ గా చూసేలా చేస్తున్నాయి.  డార్లింగ్ ప్రభాస్ ను ఎలా చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారో అలా చూపించారు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. డిసెంబర్ 5న "రాజా సాబ్" సాధించబోయే బాక్సాఫీస్ రికార్డులకు టీజర్ సక్సెస్ చిన్న శాంపిల్ గా నిలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ "రాజా సాబ్" చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ హిట్ డైరెక్టర్ కార్తీక్ రాజు

Image
ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం టాప్-మోస్ట్ బ్యానర్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్న కార్తిక్ రాజు కార్తిక్ రాజు...ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ ద‌ర్శ‌కుడి పేరు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన "తిరుదన్ పోలీస్" సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది.  ఆ త‌ర్వాత  "ఉల్కుతు" మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం "నేనే నా" తో తన విజయ పరంపరను కొనసాగించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన "నిను వీడని నీడను నేనే` సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించాడు. ఇక రీసెంట్‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేన‌ర్లో శ్రీ‌విష్ణు హీరోగా తెర‌కెక్కిన #సింగిల్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. "నిను వీడని నీడను నేనే" మరియు శ్రీ విష్ణు నటించిన తాజా బ్లాక్‌బ...

గద్దర్ అవార్డ్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది - టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Image
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి,  సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహణతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు కొన్ని గంటల పాటు సమయం కేటాయించి అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నింపాయి. అవార్డ్ పొందిన ప్రతి ఒక్కరూ ఇంకా బాగా మూవీస్ చేయాలనే స్ఫూర్తి పొందుతారు. ఏటా గద్దర్ అవార్డ్స్ క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నా. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారు కూడా గద్దర్ అవార్డ్స్ విజయవంతం కావడాన...