Posts

నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా "నిశ్శబ్ద" సినిమా టీజర్ లాంఛ్

Image
మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "నిశ్శబ్ద". ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "నిశ్శబ్ద" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి  నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ - "నిశ్శబ్ద" చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఆయన ఈ చిత్రంతో ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. అన్నారు. యువ హీరో కృష్ణ మాట్లాడుతూ - "నిశ్శబ్ద" సినిమా టీజర్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా...

జూన్ 13న థియేటర్స్ లో సత్యరాజ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ "కట్టప్ప జడ్జిమెంట్" !!!

Image
అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మాతగా బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కట్టప్ప జడ్జిమెంట్". తీర్పుగల్ విర్కపడుమ్ తమిళ చిత్రాన్ని తెలుగులో కట్టప్ప జడ్జిమెంట్ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత వెంకట స్వామి. బాహుబలి కట్టప్ప అంటే తెలుగులో తెలియని ప్రేక్షకులు వుండరు. అంతలాఎడతెగని అనుబంధం ఉంది తెలుగులో సత్యరాజ్ గారికి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  యు/ఏ  సర్టిఫికెట్ అందుకుంది. జూన్ 13న  తెలుగులో విడుదల చేయడానికి నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యర్థి పాత్రలో మధుసూదనరావు అద్భుతంగా నటించారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో  సందేహం లేదు. కట్టప్ప ఏ విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడో వెండితెరపై చూసి తెలుసుకోండి. ఈ చిత్రానికి ధెరన్ దర్శకత్వం వహించారు.  మరియు స్మ్రుతి వెంకట్, సత్యరాజ్, హరీష్ ఉత్తమన్ మరియు మధుసూధన్ రావు, రవిప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.

‘బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో రవి మోహన్

Image
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన రవి మోహన్ ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కిలూనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన కార్తీక్ యోగి దర్శకత్వంలో ఈ ‘బ్రోకోడ్’ రానుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. పోర్ తోజిల్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్ శివాజీ, యానిమల్, అర్జున్ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్ ఇ. రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ. రాజేష్ వ్యవహరించనున్నారు. స్లాప్ స్టిక్ కామెడీ అంశాలతో కూడిన వినోదాత్మక ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నటుడు రవి మోహన్ స్వయంగా రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు కార్తీక్ యోగి మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈ కథను ప...

భాష ఆధారిత, వ్యక్తిగతీకృత కంటెంట్ ప్లాట్‌ఫారంగా మారుతూ కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో ముందుకు వస్తోన్న ZEE5

Image
  -  ఆధునిక భారతీయ ఆత్మను ప్రతిబింబించేలా అధునికతతో ఆకర్షణీయమైన కొత్త లోగోతో ZEE5   -  వైవిధ్యమైన భాషలు, కథలతో, సినీ సెలబ్రిటీల భావోద్వేగాల అనుబంధాలను ఆవిష్కరించేలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో మానసికంగా ముడిపడేలా రూపకల్పన   - అల్ట్రా హై డెఫినిషన్ క్వాలిటీ కంటెంట్, డాల్బీ ఆటమాస్‌తో నెలకు ₹120 ప్రారంభ ధరలో 7 భాషల్లో ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోన్న ZEE5   - 2026 ఏడాదిలో 130కి పైగా కొత్త టైటిల్స్ విడుదలకు సిద్ధం – ఒరిజినల్ షోలు, సినిమాలు, నాన్-ఫిక్షన్, లైవ్ కంటెంట్ మరియు మరెన్నో భిన్న భాషల్లో మెప్పించనున్న ZEE5   భారతదేశ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా ముందడుగు వేసింది ZEE5. అందులో భాగంగా తన కొత్త బ్రాండ్ ఐడెంటిటీని తెలియజేస్తూ వ్యూహాత్మకంగా ముందడగు వేసింది. ZEE5 తన శక్తివంతమైన కొత్త బ్రాండ్ ఐడెంటిటీ, వ్యూహాత్మక మార్పును అధికారికంగా ప్రకటించింది. ZEE5 డెవలప్‌మెంట్‌లో దీన్ని కీలక ఘట్టంగా అభివర్ణించవచ్చు. ‘మన భాష -  మన కథలు’ అనే పున: ప్రారంభంతో భారతీయ సంస్కృతిలోని బోలెడు కథలను నిబద్ధతతో చెప్పటానికి, భాషాధారిత,...

ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన "చండీ దుర్గమా" సినిమా

Image
మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్  లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ  ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్  నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం  వహించారు.  ఈ సందర్భంగా…..  *ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ* - చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్ తో సహా టీమ్ అందరికీ మంచిపేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. *డైరెక్టర్ మై...

సరికొత్త కథాంశంతో.. సరికొత్తగా 'పయనం' చిత్రం ప్రారంభం

Image
రోటి కపడా రొమాన్స్‌ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్‌ హీరోగా, 'జనక అయితే గనక' చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్‌ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం 'పయనం' ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఛాయచిత్రాలు పతాకంపై చందురామ్‌ దర్శకత్వంలో స్వర్ణ కమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ క్లాప్‌ నివ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్వీచాన్‌ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. డ్రామా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా  తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్‌ చేసే అంశాలు చాలా ఉంటాయి.  అవసరాల శ్రీనివాస్‌ మా చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. అంతేకాదు ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది. మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. జూలై 7 నుండి రెగ్యులర...

‘బద్మాషులు’ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి నవ్వులతో ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు !!!

Image
‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్‌లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి  ఇద్దరూ హీరోలుగా నటించిన చిత్రమిది, ఈ చిత్రానికి  శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాల నడుమ (జూన్‌ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కామెడీ తో పాటు మంచి ఎమోషన్ ఉన్న మంచి సినిమాగా పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది. బద్మాషులు చిత్రంలో విద్యా సాగర్‌, మహేశ్‌ ఇద్దరు తెరపై సహజ నటన జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత ఇద్దరూ నవ్వులు పూయించారు. తేజ కూనూరు సాంగ్స్, నేపథ్య సంగీతం బాగుంది. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్‌ కుమార్‌ ఎడిటింగ్‌ ఇలా అన్ని ఈ సినిమాకు కలిసొచ్చాయి. థియేటర్స్ లో ఉన్న బద్మాషులు సినిమాను స్నేహితులతో మరియు ఫ్యామిలీ తో సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.