Posts

జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల, చిత్ర యూనిట్ కు ఆకాష్ జగన్నాధ్ బెస్ట్ విషెస్ !!!

Image
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాధ్ మాట్లాడుతూ... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. సాంగ్స్ ప్రోమోస్ బాగున్నాయి. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నటీనటులు: అవిన...

వైభవంగా రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు !!!

Image
టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, నిర్మాత రాధ మోహన్, సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్ కుమార్, రచయితలు డార్లింగ్ స్వామి, లక్ష్మీ భూపాల, బివిఎస్ రవి, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఆర్ ఆర్ ధ్రువన్, సింగర్ శ్రీరామ చంద్ర, నటులు రచ్చ రవి, అశ్విన్ బాబు, సింగర్ కౌసల్య, దర్శకులు వీర శంకర్, రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రచయిత సత్యదేవ్ జంగా నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యారు, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశారు. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశారు.  ఆ తరువాత నాని సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ్ జంగా కు రచయితగా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఎంఎల్ఏ , నేనే రాజు నేనే మంత్రి నిర్మాత భరత్ చౌదరి గారి కరణ్ సి ప్రొడక్షన్స్ లో ఆకెళ్ల వంశీ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు కథ అందించబోతున్నారు. ఆయన అన్ని రకాల జానర్స్ లో కథల...

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల !!!

Image
 ది ట్రయల్ చిత్రం (2023) లో థియేటర్స్ లో విడుదలై విజయం సాధించిన తర్వాత, నిర్మాతలు ఫ్రాంచైజీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి భాగం కోసం "ది ట్రయల్: షాడో డెట్" అనే కాన్సెప్ట్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దృశ్యపరంగా ఆకర్షణీయం గా కనిపిస్తున్న ఈ పోస్టర్ ది ట్రయల్ కథ అసలు నీడల్లోకి లోతుగా మునిగిపోయే చిల్లింగ్ ప్రీక్వెల్‌ను సూచిస్తుంది. నవంబర్ 26, 2023న థియేటర్లలో విడుదలైన ది ట్రయల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం డిజిటల్ లో లాభాలను సాధించింది. ఇది జనవరి 9, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడం ప్రారంభించి, అక్కడ ఇది అద్భుతమైన వీక్షకుల సంఖ్యను సంపాదించి మంచి హిట్‌గా నిలిచింది. బడ్జెట్ రికవరీ మరియు లాభదాయకత పరంగా ఉండటంతో ఈ కథా ప్రపంచాన్ని విస్తరించడానికి నిర్మాతలు ముందడుగు వేశారు.  ఈ ట్రయల్ ప్రపంచంలో మొదటి భాగం ఆరంభం కాకముందే ప్రారంభమయ్యే కథ ది ట్రయల్ : షాడో డెట్. దాని నైతిక సందిగ్ధతలు మరియు పరిశోధనాత్మక లోతుతో ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ, “షాడో డెట్” మొదటి సినిమా కథనానికి దారితీసిన సంఘటనలను అన్వేషిస్తుందని...

అశ్విన్ బాబు హీరో గా, మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం లో, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిర్మిస్తున్న చిత్రం 'వచ్చిన వాడు గౌతమ్' ఈ చిత్రం నుండి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Image
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ 'వచ్చినవాడు గౌతమ్'. మెడికల్ యాక్షన్ మిస్టరీ  గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు.   గోల్డ్ లైన్ క్రియేషన్స్, ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్. బ్లెడ్ అండ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై  క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో సాయి రోణక్ కేమియో పాత్ర లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్,   ఖేడేకర్, అభినయ,  అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్  గా పని చేస్తున్...

శ్యామ్ సింగ రాయ్ రచయితగా నాకు గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

Image
టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ... ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ... నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యాను, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశాను. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశాను.  సంగీత దర్శకుడు చక్రిని బాచి సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేశాను, పూరి జగన్నాద్ తో నాకు ఉన్న పరిచయం తో చక్రిని ఎంకరేజ్ చెయ్యడం జరిగింది. అలా సినిమా ఇండస్ట్రీ తో పరిచయాలు బలపరుచుకొని, సాహిత్యం మీద మక్కువతో 2020లో ఆదిత్య మ్యూజిక్ నుండి బయటికి వచ్చి పూర్తిగా రచన వ్యాసంగం పై ఫోకస్ చేస్తూ... పునర్జర్మ బాక్డ్రాఫ్ లో పిరియడిక్ లవ్ స్టోరీతో ఒక కథను సిద్ధం చేసుకున్నాను.  ఈ కథను దర్శకుడు రాహుల్ సాంకృతియన్ కు చెప్పడం జరిగింది తనకు ఈ కథ నచ్చి హీరో నానికి, సాయి పల్లవికి వినిపించడం జరిగింది. వారిద్దరికి ఈ కథ విపరీతంగా నచ్చడంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రంగా రోపొంది ఘన విజయం సాధించింది. ఈ సినిమా రచయితగా నాకు...

థియేటర్, టీవీ, ఓటీటీ ఎక్కడ రిలీజైనా "28°C" మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది - హీరో నవీన్ చంద్ర

Image
తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్  నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "28°C" మూవీలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరో నవీన్ చంద్ర. - ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉం...

షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!

Image
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్టర్  ఎంజిఆర్ మాట్లాడుతూ... బ్లడ్ రోజస్ సినిమా లో రంజిత్ రామ్, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప సహకారం మరువలేనిది, నిర్మాత హరీష్ కె అభిరుచిగల ప్రొడ్యూసర్, సినిమాను రిచ్ గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ లో నిర్మించారు. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు హరీష్ కె గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నిర్మాత హరీష్ కె మాట్లాడుతూ... మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా డైరెక్టర్ ఎంజిఆర్ పరిచయం అయ్యారు, బ్లడ్ రోజస్ సినిమా బాగా వచ్చింది. మాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ మాట్లాడుతూ... నిర్మాత హరీష్ క...