"కాలమేగా కరిగింది" సినిమా నుంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ 'దరీ దాటిన మోహం..' రిలీజ్, ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతున్న మూవీ
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ 'దరీ దాటిన మోహం..' విడుదల చేశారు. 'దరీ దాటిన మోహం..' పాటకు డైరెక్టర్ శింగర మోహన్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ మరో మంచి ట్యూన్ అందించారు. సింగర్స్ సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా పాడారు. 'దరీ దాటిన మోహం..' పాట ఎలా ఉందో చూస్తే - ' దరీ దాటిన మోహం దేహమే కదా, ఎదుటే నిలిచేనూ, ఆ యదపై తాకేనూ, చెలీ వీడినా మౌనం, మర్మమే కదా, కథలై కదిలేనూ, ఆ కబురై పాకేనూ..' అంటూ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. మ్యూజికల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది "కాలమేగా కరిగింది" సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటిక...