జూలై 19న అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్పై రూపొందిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ స్ట్రీమింగ్
యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే.. పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీ...