Posts

జూన్ 25న యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ విడుదల

Image
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ‘భారతీయుడు 2’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అందులో ముస‌లి పాత్ర‌లోని క‌మ‌ల్ హాస‌న్ ట్రాలీ బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్నారు. అంటే పోస్ట‌ర్‌తో ట్రైల‌ర్ వచ్చేస్తుంద‌నే విష‌యాన్ని సింబాలిక్‌గా చ‌క్క‌గా చెప్పిన‌ట్లుంది పోస్ట‌ర్ చూస్తుంటే.  అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌త...

ఘనంగా 'జయహో రామానుజ' సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Image
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జయహో రామానుజ'. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల 'జయహో రామానుజ' సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్ కు అభినందనలు అందజేశారు. పాటలు బాగున్నాయంటూ వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 'జయహో రామానుజ' లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ* - 'జయహో రామానుజ' సినిమా చేయాలనేది నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ కల. తన కలను నెరవేర్చుకున్న సంతోషంలో ఆయనలో కనిపిస్తోంది. 'జయహో రామానుజ' పాటలు చాలా బాగున్నాయి....

హిట్ టాక్ తో థియేటర్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న "హనీమూన్ ఎక్స్ ప్రెస్:

Image
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. 50 స్క్రీన్ తో నిన్న రిలీజైన "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమా అదే రోజు 70 స్క్రీన్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారు. బీ, సీ సెంటర్ లో కొత్త థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, కాంటెంపరరీ స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిన ‌పద్ధతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మూవీ లోని నాలుగు పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట కొత్తదనం అందిస్తోంది. ద్వితీయార్థంలో వచ్చే వీరి రొమాంటిక్ సాంగ్ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్ కూడా కథలో కీలకంగా ఉండి ఆకట్టుకుంటోంది. దర్శకుడు...

పీరియాడిక్‌ హై యాక్షన్‌ డ్రామాతో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ నూతన చిత్రం

Image
విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయాల తరువాత  సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇటీవల ప్రారంభమైంది.  విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయకుడు సాయి దుర్గ తేజ్‌ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను నిర్మాతలు శుక్రవారం విడుదల చేశారు. ల్యాండ్ మైన్‌లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఓ యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుతన్నట్లు కనిపిస్తుంది.  నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.  పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో సాయి దుర్గ తేజ్‌ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట...

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్

Image
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు "తుఫాన్" సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్ చేశారు.  'వెతికా నేనే నా జాడే' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ' వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ' అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట. "తుఫాన్" సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబ...

"ది కానిస్టేబుల్"గా వరుణ్ సందేశ్ నట విశ్వరూపంనిన్నటితో షూటింగ్ పూర్తి

Image
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం "ది కానిస్టేబుల్".  వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా బుధవారం నాటితో హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. . ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ,  "సినిమా షూటింగ్ అంతా చాలా హాయిగా సాగింది. త్వరలో కానిస్టేబుల్ పాత్ర లో కొత్తకోణంలో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల  ముందుకు వస్తున్నాను" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ,  "కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైమ్  థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చు. త్వరలో ఈ చిత్రం పాటలను, మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు.  ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య ...

"ధూం ధాం" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మాయా సుందరి..' లిరికల్ సాంగ్ విడుదల

Image
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "ధూం ధాం" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మల్లెపూల టాక్సీ..' పాట ఛాట్ బస్టర్ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. తాజాగా "ధూం ధాం" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మాయా సుందరి..' విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. 'మాయా సుందరి..హే మాయా సుందరి..నా మాయా సుందర...