Posts

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’

Image
సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ... జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి.  నిర్మాత శివకాంత్ మాట్లాడుతూ... జమాన సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతఙ్ఞతలు అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాము అన్నారు.  ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్ర...

ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్

Image
 వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్.. హీరోయిజంను ఫర్ఫెక్ట్ గా ప్లే చేసే హీరో నవీన్ చంద్ర పవర్ ఫుల్ రోల్ లో.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు.. హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకేక్కిస్తున్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’.* ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారని నిర్మాత తెలిపారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... "ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందించాం. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్ష...

ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్తానం

Image
'సోగ్గాడు' స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మురళీమోహన్  నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, "నాకు తొలి అవకాశం ఇచ్చింది  నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే  నన్ను ప్రోత్సహించింది  దాసరి నారాయణరావు, నన్ను సినిమా రంగంలోనికి  రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు.  నా జీవితంలో ఈ ముగ్గురినీ ఎన్నటికీ మరచిపోలేను. శోభన్ బాబుతో నేను 'ముగ్గురు మిత్రులు' అనే చిత్రం కూడా తీశాను. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. ఆయన నుంచి నాలాంటి  వారెందరో స్ఫూర్తి పొందారు...

“Dekhlenge Saala” song from ‘Ustaad Bhagat Singh’ Has Created History

Image
*Breaking records with over 29.6 million views in just 24 hours!  The Dekhlenge Saala song from Ustaad Bhagat Singh has created history, breaking records with over 29.6 million views in just 24 hours! The song has become an instant hit, going viral on social media and captivating audiences worldwide. DSP's catchy composition and the team's hard work have paid off, earning widespread acclaim. Dinesh Master's choreography, tailored perfectly for Pawan Kalyan, has received huge applause. Bhaskarabhatla's motivational and commercial blend of lyrics has proved to be a massive success. The efforts of Cult Captain Harish Shankar have resulted in a visual treat for fans, convincing Pawan Kalyan to dance and delivering a massive feast. The song's success is also attributed to the tireless efforts of Art Director Anand Sai, Costume Designer Neeta Lulla, and Cinematographer Ravi Varman, who have collectively created a vibrant and visually stunning experience. The t...

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది. -దగ్గుబాటి పురందేశ్వరి

Image
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు గారు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని డిసెంబర్ 13 హైదరాబాద్ FNCC లో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్న శ్రీమతి పురందేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన జరిగింది. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు, శ్రీ నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని క్రిష్ణయ్య, చైతన్య రాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన శ్రీమతి గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూదనరాజు, బిక్కి కృష్ణ, ప్ర...

డి.వి.ఎస్ రాజు 97వ జయంతి వేడుక.

Image
తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి.వి.ఎస్. రాజు. ఈరోజు డిసెంబర్ 13 డి.వి.ఎస్ రాజు 97వ జయంతి జరువుకున్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా గాంధీ లాభాల్లో కొంత భాగాన్ని ఎన్.ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను రాజు గారు కీలకమైన భూమిక పోషించారు. రాజుగా గారు సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో విశేషమైన కృషి చేశారు. 1950 లో మహానటుడు ఎన్.టి.రామారావు గారితో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. రాజు గారిని తన భాగస్వామిగా చేసుకొని నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్.టి.ఆర్ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. 1960లో రాజు గారు డి.వి.ఎస్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు . అయినా రాజు గారితో రామారావు గారి మైత్రీ బంధం కొనసాగింది. చైనా యుద్ధం, రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన లాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎన్.టి.రామారావు నాయకత్వంలో ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమాలను రాజు గారే సమన్...

నాగార్జున గీతాంజలి మళ్ళీ థియేటర్స్ లో...

Image
బాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి సి. పద్మజ (Proprietor) గారు W/o C.L. Narsareddy గారు నిర్మించిన గీతాంజలి (1989) చిత్రం యొక్క వరల్డ్ వైడ్ (చెన్నై మినహాయించి) రీ-రిలీజ్ హక్కులని శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు గతంలో పొంది వున్నారు. మణిరత్నం గారు దర్శకత్వం వహించి అక్కినేని నాగార్జున గిరిజ షట్టర్ విజయకుమార్ గార్లు నటించిన ఈ చిత్రం యొక్క 4K డిజిటల్ కార్యక్రమాలను అత్యున్నత ప్రామాణికాలతో నిర్వహించి త్వరలో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ చిత్రం నాకు ఎంతో ఇష్టమైనది. అందుకని ఈ గీతాంజలి యొక్క రీ-రిలీజ్ హక్కులను పొందడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది అని తెలిపారు.